ఈ లేపాక్షి రహస్యాలు నిండిన దేవాలయమా? అణచివేయబడిన చరిత్ర యొక్క సాక్షాలు!
Hey guys, నేను ఆంధ్రప్రదేశ్ లో లేపాక్షిలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయంలో ఉన్నాను, ఇప్పుడు నేను రాక్షసుల గురించి కొన్ని బలమైన సాక్ష్యాలను మీకు చూపబోతున్నాను. పురాతన కాలంలో రాక్షసులు ఉండేవాళ్లా, అలా ఉండుంటే, లేపాక్షిలో ఉన్న ఈ అద్భుతమైన కట్టడాలను వాళ్లే కట్టారా? ఈ ఆలయం కేవలం 500 సంవత్సరాలకు ముందు నిర్మించబడిందని archeologistsలు వాదించినప్పటికీ, ఈ ఆలయాన్ని దానికంటే ముందుగా పెద్ద ఎత్తున్న దేవుళ్ళ చేత నిర్మించబడిందని ఇక్కడ ఉన్న స్థానికులు నమ్ముతున్నారు. Actually, ఈ ఆలయంలో ఒక పెద్ద పాదముద్ర ఉంది, ఇది సుమారు 25 నుండి 35 అడుగుల వరకు ఎత్తులో ఉన్న పాదముద్ర కావచ్చు, దీని గురించి మనం ఆలోచిద్దాం.
కానీ ఈ లేపాక్షి ఆలయం లోపల కనిపించిన ఈ పాదముద్ర best evidence కాదు, ఈ ఆలయం వెలుపల 500 మీటర్ల దూరంలో చెక్కబడిన ఈ పెద్ద నంది విగ్రహమే కచ్చితమైన evidence. లేపాక్షిలో ఉన్న ఈ నంది విగ్రహమే ప్రపంచంలోని అతిపెద్ద నంది శిల్పం. ఒకే రాతితో తయారు చేయబడిన ఈ నందిని చాలా అద్భుతంగా చెక్కబడింది ఇంకా ఇది దాదాపు 15 అడుగుల ఎత్తుగా మరియు 27 అడుగుల పొడవుగా ఉంది. ఈ నందిని కేవలం 500 సంవత్సరాలకు ముందు మాత్రమే సృష్టించారని Archaeologistsలు చెబుతున్నారు. కానీ ఈ నదిలో చాలా విచిత్రమైన ఒక విషయం ఉంది, అదేంటంటే ఇది ఒంటరిగా ఉంది.
మన భారతీయ వాస్తుశిల్పం ప్రకారం చూసుకుంటే, ప్రతి నంది తప్పనిసరిగా లింగంతో ముడిపడి ఇంకా దానికి ఎదురుగా ఉండాలి. ఇంకా నంది ఎప్పుడూ లింగానికి ముందు చెక్కబడి ఉంటుందని మన ప్రాచీన భారతీయ గ్రంథాలు confirm చేస్తున్నాయి. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా, దాని ముందు ఏఒక్క లింగం లేదు. పురాతన శిల్పులు ప్రపంచంలోనే అతిపెద్ద నందిని చెక్కి, దానికి ముంది ప్రధాన దేవుడైన లింగాన్ని పెట్టడం మర్చిపోయారా ఏంటి? వాళ్లు ఈ అద్భుతమైన ఏకశిలా శిల్పాన్ని సృష్టించి, దానిని ఒంటరిగా ఇలా ఎందుకు విడిచిపెట్టారు?
ఈ ప్రశ్నకు Archaeologistsల దగ్గర సమాధానం లేదు, కానీ ఇక్కడ ఉన్న స్థానికులు సరైన సమాధానాన్ని చెప్తున్నారు. ఈ నందికి సంబంధించిన లింగం ఆలయ గోడల లోపల 500 మీటర్ల దూరంలో ఉందని చెప్తున్నారు. ఈ పెద్ద లింగం దాదాపు 12 అడుగుల పొడవు ఉంటుంది మరియు 7 తలలతో ఉన్న నాగదేవుడు లింగాన్నీ రక్షింస్తున్నాడు. ఈ రకమైన లింగాన్ని నాగలింగం అని పిలుస్తారు, అది మాత్రమే కాదు, మీరు చూస్తున్న ఈ లింగమే ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగం. ఇంకొక interesting ఐన విషయం... ఈ లింగం చుట్టూ చూసారంటే దానికి ఎదురుగా ఏఒక్క నంది కూడా ఉండదు, అయితే ఎలా పూజించాలి? కాబట్టి ఇప్పుడు, లింగానికి ముందు నందిని ఉంచడానికి కారణం ఏంటని చూద్దాం... భారతీయ దేవాలయాలలోని ప్రతి శిల్పం ఒక కారణం కోసం తయారు చేయబడిందని నేను ఎప్పుడూ వాదిస్తూ ఉంటాను, కాబట్టి పాతకాలంలో నందిని ఎలా ఉపయోగించారు?
మన ప్రాచీన వేద గ్రంథాలలో, లింగాన్ని ఎలా పూజించాలనే విధానాన్ని ప్రస్తావిస్తున్నాయి, కానీ మనమే దాన్ని మరచిపోయాము. పురాతన ప్రజలు నంది కొమ్ములపైన వాళ్ళ 2 వేళ్లు పెట్టి, దాని ద్వారా లింగాన్ని దర్శించుకుంటారు. గత కొన్ని శతాబ్దాల వరకు హిందువులు ఈ క్రమాన్ని చాలా ఖచ్చితంగా పాటించారు. ఇదే నంది యొక్క అసలైన ఉద్దేశ్యం. మీరు ఈ పెద్ద నంది పైకి ఎక్కి, ఈ రెండు కొమ్ముల ద్వారా చూస్తే, ఈ రోజు కూడా మీరు ఆ పెద్ద లింగాన్ని చూడగలరు. అయితే, ఆ నంది ఈ లింగానికి చెందినదని confirm చేయడం మాత్రమే కాకుండా, దీన్ని ఎవరు సృష్టించారనే మరింత ఆశ్చర్యపరిచే విషయాన్ని కూడా ఇది మనకు చెప్తుంది.
ఏ జాతికి చెందిన వాళ్ళు దీన్ని చేసారో, వాళ్ళు కచ్చితంగా ఈ కొమ్ముల ద్వారా ఆ లింగాన్ని చూడగలిగేంత ఎత్తులో ఉండాలి కదా. ఈ నంది 15 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి ఇది కచ్చితంగా పురాతన నిర్మాణదారులు దాదాపు 30 అడుగుల ఎత్తు ఉండాలి. కానీ ఈ రోజు, మీరు ఆ కొమ్ముల నుండి చూస్తే, మీకు సగం లింగం మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే ఆలయ గోడలు మిగిలిన వాటిని చూడనివ్వకుండా చేస్తాయి. పురాతన నిర్మాణదారులు నందిని మాత్రం బయట వదిలేసి గోడ మరియు దేవాలయాన్ని ఎందుకు సృష్టించారు? ఈ లింగాన్ని ఇంకా నందిని నిర్మించింది రాక్షసులే, అయితే ఈ రోజు మనం చూస్తున్న ఈ కొత్త ఆలయం గత 500 సంవత్సరాలలో నిర్మించబడింది.
మీరు ఈ 2 శిల్పాలను గుడిలో ఉన్న మిగిలిన లక్షణాలతో పోల్చి చూస్తే, మీరు ఒక అద్భుతమైన వ్యత్యాసాన్ని చూడవచ్చు. మొదట కట్టిన నిర్మాణదారులు ఏకశిలా నిర్మాణాన్ని ఉపయోగించారు. లింగం మరియు నంది, ఈ రెండు నిర్మాణాలు అన్నిటికంటే చాలా పెద్దవి మాత్రమే కాదు, అవి రెండు కూడా ఒకే రాయితో తయారు చేయబడ్డాయి. కానీ ఈ కొత్త గుడిలో ఉన్న ఆర్కిటెక్చర్ పూర్తిగా చాలా differentగా ఉంది. ఇప్పుడు ఈ గోడలను ఒకసారి పరిశీలిద్దాం - పెద్ద స్లాబ్లను కత్తిరించి ఒకదానికొకటి ఇంటర్లాక్ చేశారు, చూడడానికి పెరిరూలో ఉన్న మచ్చు పిచ్చు మాదిగానే ఉంది.
నేను చెప్తున్నదాన్ని తప్పుగా అనుకోవద్దు, ఇది కూడా అసాధారణమైన టెక్నాలజీనే, ఈ బ్లాక్లను ఒకదానితో ఒకటి అమర్చడం అనేది నిజంగా చాలా కష్టం, ఈ మూలలను చూడండి ఇవన్నీ చాలా perfectగా ఫిట్ అయ్యాయి, కానీ ఇది కేవలం 500 సంవత్సరాల క్రితం సృష్టించబడింది. ఈ రోజు మనం చూస్తున్న ఈ ఆలయం, అనేక రాతి బ్లాకులను పేర్చి, అయితే ఇక్కడ ఉన్న అసలైన దేవాలయం సింగిల్ స్టోన్ ఆర్కిటెక్చర్ అంటే ఒకే రాయిలో చెక్కే technique ని ఉపయోగించారు.
- Praveen Mohan Telugu











